హైదరాబాద్, జనవరి 26(నమస్తే తెలంగాణ): ప్రేమను వ్యక్తంచేయడానికి కౌగిలింత ఒక మార్గం. కౌగిలింత ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న బంధంలోని గాఢతను, ఆప్యాయతను తెలియజేస్తుంది. తల్లీపిల్లల మధ్య అనుబంధానికి చిహ్నం అది. ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం వల్ల అటు పిల్లలకు ఇటు తల్లులకు ఎంతో స్వాంతన చేకూరుతుంది. పిల్లలు ఎదిగేకొద్దీ.. జీవనశైలిలో మార్పులతోపాటు తమ తల్లులతో సాన్నిహిత్యం కూడా తగ్గిపోతున్నది. ఈ దూరం రోజురోజుకూ పెరుగుతున్నదని ఐటీసీ సన్ ఫీస్ట్ సంస్థ తెలిపింది. తల్లులను పిల్లలు కౌగిలించుకోవడం ఎం దుకు తగ్గుతున్నది అన్న అంశంపై ఈ సంస్థ ‘మామ్స్ మ్యా జిక్’ పేరిట ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో సర్వే చేసింది. తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నవారు, దూరంగా ఉంటున్న విద్యార్థులు, వరింగ్ ప్రొఫెషనల్స్, గృహిణు లు, యువత ఇలా అనేక వర్గాలతో మాట్లాడి వివరాలను సేకరించింది. ఈ సర్వే కోసం 13-35 ఏండ్ల మధ్యనున్న వారిని ఎంచుకున్నారు. పిల్లలు స్వతంత్రులయ్యేకొద్దీ తల్లు లు ఒంటరితనానికి గురవుతున్నారని ఈ సర్వేలో గుర్తించారు. సర్వే నివేదిక ప్రకారం.. ఇటు పని అటు సామాజిక బాధ్యతలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల తల్లిదండ్రులతో కలిసి గడిపే సమయం, భౌతికంగా వారికి దగ్గరగా ఉండటం తగ్గిపోతున్నది. దాదాపు 50 శాతం మంది యువత తల్లి ఆప్యాయ కౌగిలింతను మరచిపోయామని చెప్పారు. అయితే తమ సంతోషాలకు మూలకారణం తమ తల్లులేనని 60శాతం మంది చెప్పడం విశేషం.
ఓటీటీ కన్నా అమ్మ కౌగిలింతే మిన్న
తల్లిని కౌగిలించుకున్నప్పుడు కలిగే సంతోషం ఏ స్థాయిలో ఉంటుందో తెలుసుకొనేందుకు సన్ఫీస్ట్ సంస్థ ‘ది హ్యాపీనెస్ హ్యాక్ ఎక్స్పెరిమెంట్ పేరిట సామాజిక ప్రయోగాన్ని సైతం నిర్వహించింది. ఇందుకు బ్రెయిన్ ట్రాకింగ్ డివైస్ను ఉపయోగించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, కంటెంట్ను వీక్షించడం, చాటింగ్ చేస్తున్నప్పుడు, తల్లిని హగ్ చేసుకున్నప్పుడు ఒకరిలో కలిగే సంతోషాన్ని పరిశీలించారు. ఓ వ్యక్తిలో సోషల్మీడియా వినియోగిస్తున్నప్పుడు కలిగే దానికన్నా మాతృమూర్తిని హగ్ చేసుకోవడం వల్ల కలిగే సంతోషం అత్యధిక స్థాయిలో ఉన్నట్టు గుర్తించారు. ‘తల్లిని ఆప్యాయంగా కౌగిలించుకోవడం’ వల్ల అత్యంత సంతోషం కలుగడంతోపాటు, ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించే అత్యంత శక్తివంతమైన సాధనమని ఈ ప్రయోగం నిరూపించిందని సన్ఫీస్ట్ నివేదిక వెల్లడించింది.
సర్వేలో పాల్గొన్నవారు వెల్లడించిన వివరాలు
తమ తల్లులను తరచుగా హగ్ చేసుకోవడం బాల్యంతో పోలిస్తే 9-25 ఏండ్ల వయస్సు వారిలో 31శాతం, 25-35 ఏండ్ల వయస్సువారిలో 33 శాతం మేర తగ్గిపోయింది. వరింగ్ ప్రొఫెషనల్స్తో పోలిస్తే విద్యార్థులు తమ తల్లులను మరింత ఎకువగా హగ్ చేసుకుంటున్నారు.ఒత్తిడిని తగ్గించుకొనేందుకు చాలా మంది సాధారణంగా సంగీతం వినడాన్ని ఎంచుకుంటున్నారు. ఆ తరువాత ఓటీటీలో కంటెంట్ను వీక్షిస్తున్నారు. తల్లులను హగ్ చేసుకోవడం మూడో స్థానంలో నిలిచింది.