సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలోని రాయికోడ్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. తల్లి, తన నాలుగేళ్ల కూతురితో కలిసి మంజీరా నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టిస్తుంది. రాయికోడ్ మండలం చర్ల నాగన్పల్లి గ్రామానికి చెందిన విజయ(32) కుటుంబ కలహాలతో గత కొన్ని రోజులుగా మానసిక ఒత్తిళ్లకు గురువుతుంది. దీంతో ఆమె కూతురు గౌరి (4)తో కలిసి రాయికోడ్ మండలం శిరూరు గ్రామ శివారులోని మంజీరా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది .
స్థానికుల సమాచారంతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు కొద్దిదూరంలో ఇద్దరు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం కోసం జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.