నల్లగొండ : జిల్లాలోని హాలియా సమీపంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువలో దూకి ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు పోలీసుల సాయంతో యువతిని కాపాడారు. కాగా, వరదనీటి ప్రవాహంలో ప్రియుడు కొట్టుకుపోయాడు. స్థానికుల కథనం మేరకు.. మాచర్లకు చెందిన వడ్య బాలకృష్ణ (20) పీఏ పల్లి మండలం నర్సింగ్ తండాకు చెందిన మైనర్ బాలిక వరుసకు బావ మరదళ్లు. గత కొద్దికాలంగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు.
వీళ్ల ప్రేమను తల్లిదండ్రులు తిరస్కరించడంతో ఇరువురు సోమవారం సాగర్ ఎడమ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఉదయం 10గంటలకు హాలియాకు వచ్చారు. అనంతరం ఇద్దరు సాగర్ ఎడమ కాలువలో దూకారు. వరద నీటి ప్రవాహానికి బాలకృష్ణ కొట్టుకుపోగా యువతిని స్థానికులు, పోలీసులు తాడు సాయంతో కాపాడారు.