జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ఎత్తిపోతల (రామగుండం) ఈఎన్సీగా కొట్టె సుధాకర్రెడ్డిని నియమిస్తూ ఇరిగేషన్ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదివరకు ఈఎన్సీగా పనిచేసిన నల్లా వెంకటేశ్వర్లును ప్రభుత్వం ఇటీవల ఆ పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. కాగా జగిత్యాలలో ఇరిగేషన్ సీఈగా పనిచేస్తున్న సుధాకర్రెడ్డికి కాళేశ్వరం ఈఎన్సీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ కుంగిన నేపథ్యంలో ప్రస్తుతం ప్రాజెక్టు మరమ్మతు బాధ్యతలు సుధాకర్రెడ్డి భుజాన పడ్డాయి.