హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): మామిడి, జామ, దానిమ్మ, నిమ్మ, మిరప, టమాట, వంగ వంటి పండ్లు, కూరగాయలు సాగుచేసే రైతులకు ఉద్యానశాఖ ఆధ్వర్యంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీవోఈ) అండగా నిలుస్తున్నది. ఉద్యానశాఖ అధికారులు జీడిమెట్ల, ములుగు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లలో ఆయా మొక్కలను పెంచి, సబ్సిడీపై రైతులకు అందజేస్తున్నారు. విశేషమైన లక్షణాలు ఉన్న పండ్ల మొక్కలను విదేశాల నుంచి తెప్పించి, వాటిని ప్రయోగాత్మకంగా సాగు చేస్తూ, విత్తనాలను అభివృద్ధి చేస్తున్నారు. రైతులకు పంటల సాగులో ఆధునిక మెళకువలు, యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించేందుకు శిక్షణ కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు.
పండ్లు, కూరగాయలు, పూల సాగులో నాణ్యమైన విత్తనం ఎంతో కీలకమో.. మొలకెత్తిన తర్వాత మొక్క ఎదిగే క్రమంలో 45 రోజులు యాజమాన్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడం అంతే ముఖ్యం. అప్పుడే మొక్క బాగా పెరిగి.. రైతులకు మంచి దిగుబడి లభిస్తుంది. ములుగు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో 2019 నుంచి కూరగాయల నారును పెంచి రైతులకు సబ్సిడీపై అందిస్తున్నారు. ప్రధానంగా టమాట, వంగ, పచ్చిమిర్చి నారును 45 రోజుల పాటు పెంచి, రైతులకు పంపిణీ చేస్తున్నారు. ఇక్కడ పెంచిన కూరగాయల నారును 10 జిల్లాలకు సరఫరా చేస్తున్నట్టు సీవోఈ ఏడీఏ యాదగిరి, హెచ్వో ఆశిష్ తెలిపారు. ఉద్యాన పంటలు సాగు చేయాలనుకునే రైతులు సమీపంలోని ఉద్యానశాఖ అధికారిని సంప్రదించాలని ఉద్యానశాఖ కమిషనర్ ఎల్ వెంకట్రామిరెడ్డి సూచించారు.
ఈ ఏడాది పంపిణీకి సిద్ధం చేస్తున్న మొక్కలు