హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): సినిమా, టెలివిజన్ రంగాల్లో మహిళలపై వేధింపులను అరికట్టడానికి ఏర్పాటైన సబ్ కమిటీ శుక్రవారం సమావేశమైంది. హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అర్వింద్కుమార్తో కమిటీ సమావేశమై పలు అంశాలపై సమగ్రంగా చర్చించింది. దీనిపై త్వరలో నివేదిక రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనున్నది. సమావేశంలో సబ్ కమిటీ సభ్యులు సునీత, వసుధా నాగరాజు, ప్రీతి నిగం, సత్యవతి, సుమిత్ర, టీఎస్ఎఫ్డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిశోర్బాబు, పోలీసు, కార్మిక, మహిళ, శిశు సంక్షేమశాఖల అధికారులు పాల్గొన్నారు.