హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): ఉద్యోగాలు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఎస్సీ అభ్యర్థులకు 33 జిల్లాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు షెడ్యూల్డు కులాల అభివృద్ధిశాఖ ప్రకటించింది. కోచింగ్కు ఎంపికైన అభ్యర్థులకు భోజనం, టీ ఖర్చుల నిమిత్తం రోజూ రూ.75 చొప్పున (నెలకు సుమారు రూ.2,250 )స్టైపెండ్ తోపాటు రూ.1,500 విలువైన స్టడీ మెటీరియల్ను ఉచితంగా ఇవ్వనున్నట్టు తెలిపింది. డిగ్రీ ఉత్తీర్ణులై, కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షలలోపు ఉన్న అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులని, ఒక్కో జిల్లా కేంద్రంలో 75 నుంచి 100 మందికి శిక్షణ ఇస్తామని వివరించింది. 45 రోజుల నుంచి 2 నెలల వరకు సాగే ఈ శిక్షణకు అభ్యర్థులు ఈ నెల 9 నుంచి http ://tsstudycircle.co. in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
షెడ్యూల్