హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని ఓక్రిడ్జ్ పాఠశాల విద్యార్థులు వర్షిత్ నర్రా, చరిత్రెడ్డి, సుదీశ్రెడ్డి, శరత్రెడ్డి తదితరులు వోల్వ్స్ సంస్థ నిర్వహిస్తున్న చారిటీ ఫుట్బాల్ టోర్నమెంట్ ద్వారా సీఎం సహాయ నిధికి రూ.1.5 లక్షలు సమకూర్చారు. ఈ మొత్తాన్ని బుధవారం ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్కు అందజేశారు.