జగిత్యాల కలెక్టరేట్, జూలై 23: దాదాపు 22 ఏండ్ల క్రితం గల్ఫ్కు వెళ్లిన వ్యక్తి దుబాయ్లో చిక్కుకుపోయాడు. తెలియకుండా చేసిన తప్పునకు అక్కడ నర కం అనుభవించాడు. గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి చొరవతో శనివారం ఇంటికి చేరాడు. వివరాలిలా.. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కుమ్మరిపేటకు చెందిన వొల్లెం గంగరాజం ఉపాధి కోసం 2000 సంవత్సరంలో మస్కట్ వెళ్లాడు.
పొరపాటున మస్కట్ నుంచి దుబాయ్లోకి ప్రవేశించాడు. అప్పటి నుంచి అక్కడే ఉండిపోయాడు. పాస్పోర్టు అక్కడి వీసా, అకామ (పనికోసం ఇచ్చే గుర్తింపు కార్డు) లేకపోవడంతో పనికోసం అనేక ఇబ్బందులు పడ్డాడు. అతడి దయనీయ పరిస్థితిని కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకొన్న గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు గుండెల్లి నర్సింహ, ఉపాధ్యక్షుడు ఆరె శేఖర్గౌడ్ 11 నెలలుగా అక్కడి ఎంబసీ, ఇండియన్ కాన్సులేట్ అధికారులతో మాట్లాడి విడిపించగా.. శనివారం ఇంటికి చేరుకొన్నాడు. 22 ఏండ్ల తరువాత ఇంటికి వచ్చిన గంగరాజంను చూసిన భార్యాపిల్లలు ఆనందంలో మునిగిపోయారు.