హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): కొవిడ్ మహమ్మారికి చెక్ పెట్టడంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూవోహెచ్), సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) అపూర్వ విజయం సాధించాయి. హైదరాబాద్లోని ప్రముఖ ఇమ్యునోలాజికల్ కంపెనీ విన్స్ బయోప్రొడక్ట్స్ లిమిటెడ్తో కలిసి దేశంలోనే తొలి యాంటిడోట్ ‘విన్కోవ్-19’ను అభివృద్ధి చేశాయి. సార్స్కోవ్-2 వైరస్ను సమర్థంగా ప్రతిఘటించే ఈ యాంటిడోడ్పై దేశవ్యాప్తంగా రెండో విడత క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. ఈక్వైన్ పాలీక్లోనల్ యాంటీబాడీస్ను కలిగి ఉండే విన్కోవ్-19ను 200 మంది కొవిడ్ రోగులపై పరీక్షించామని, ఒమిక్రాన్, దాని మ్యుటేషన్ల నుంచి కూడా రక్షణ కల్పిస్తున్నట్టు తేలిందని మంగళవారం ఆ సంస్థలు ప్రకటించాయి. ప్రభుత్వ గుర్తింపు కోసం సిద్ధంగా ఉన్న ‘విన్కోవ్-19’ యాంటిడోట్పై త్వరలో మూడో విడత క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నట్టు తెలిపాయి.