హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): కేంద్రం మొండిగా విద్యుత్తు సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడితే నిరవధిక సమ్మకు దిగుతామని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఈఈఏ) అధ్యక్షుడు ఎన్ శివాజీ హెచ్చరించారు. శనివారం హైదరాబాద్లో జరిగిన టీఈఈఏ జనరల్ కౌన్సిల్ సమావేశంలో విద్యుత్తు సవరణ బిల్లు, పీ ఆర్సీ తదితర అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని రకాల వినియోగదారులకు 24 గంటల నిరంతర విద్యుత్తు అందించేందుకు శ్రమిస్తున్న ఉద్యోగులకు ఆశాజనక ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించాలని విజ్ఞప్తిచేశారు. తెలంగాణ ఇంజినీర్లకు కల్పించిన పదోన్నతులను వెనక్కి తీసుకోరాదని, ఇరిగేషన్, ఆర్అండ్బీ, పోలీసు డిపార్ట్మెంట్ల తరహా నాన్క్యాడర్ పోస్టులను సృష్టిం చి సమస్యను పరిష్కరించాలని కోరారు.
సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేయడం, కేంద్ర విద్యుత్తు సంస్థల మాదిరిగా టైమ్ బౌండ్ ప్రమోషన్స్ పాలసీని అనుసరించడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీఈఈఏ ప్రధాన కార్యదర్శి రామశ్వేరయ్యశెట్టి, బందెల రవి, తుల్జారాంసింగ్, ఎల్ సంపతిరావు, విజేందర్రెడ్డి, ప్రవీణ్కుమార్, తిరుపతయ్య, లింగమూర్తి, లక్ష్మ య్య, గోపికృష్ణ, పున్నానాయక్ తదితరులు పాల్గొన్నారు.