జనగామ : ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కొడకండ్ల మండలం రామరం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రెండు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే మిల్లర్ల పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతు బంధావుడు సీఎం కేసీఆర్ అన్నారు. కరోనా కష్ట కాలంలో కూడా రైతు బంధు ఇచ్చిన గొప్ప వ్యక్తి అని ప్రశంసించారు.