Stephen Raveendra | హైదరాబాద్, ఏప్రిల్ 27(నమస్తే తెలంగాణ): రా ష్ట్రంలో పెట్రోల్, డీ జిల్ కొరత అసలే లేదని, ఎవరైనా బ్లాక్మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని సివిల్ సైప్లె కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించా రు. కొరత సృష్టించినా, అక్రమంగా నిల్వ ఉంచినా లేదా ప్రజలను భయపెట్టేలా పుకార్లు చేసినా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.
పెట్రోల్, డీజిల్ కొరత ఉన్నదని సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరారు. రాష్ట్రంలో సరిపడా ని ల్వలు అందుబాటులో ఉన్నాయని తె లిపారు. రాష్ట్రంలో రోజుకు 7,443 కిలోలీటర్ల పెట్రోల్, 11,081 కిలో లీటర్ల డీజిల్ మొత్తం 18,524 కిలో లీటర్ల ఇంధనం ఎలాంటి ఇబ్బందులు లే కుండా సరఫరా అవుతున్నట్టు చెప్పా రు. ఎవరూ ఆందోళనతో బంకుల వద్ద కు పరుగులు తీయవద్దని హితవు పలికారు. ఇండ్లలో నిల్వ చేసుకోవద్దని హె చ్చరించారు. ఫిర్యాదులు, సమస్యలు పౌరసరఫరాల శాఖ హెల్ప్లైన్ నంబర్ 1967కు కాల్ చేయాలని కోరారు.