హైదరాబాద్ : వికారాబాద్ జిల్లాలో బాలిక హత్య కేసు ఘటనను సుమోటోగా స్వీకరిస్తున్నామని తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాకిటి సునీతాలక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. తక్షణమే దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకునే విధంగా కమిషన్ కృషి చేస్తుందన్నారు. ఈ మేరకు కమిషన్ కార్యాలయం సోమవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు.
15 సంవత్సరాల బాలికను హత్య చేయడం దారుణమని, మనుషుల్లో మానవత్వం లోపించి ఇలాంటి ఘటనలు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సహకారంతో నిందితులను గుర్తించి శిక్షించడంతో పాటు బాలిక కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి దుండగుల బారీ నుంచి రక్షించబడాలంటే బాలికలు, మహిళలు స్వీయ రక్షణ పద్ధతులు పాటించి ప్రాథమిక రక్షణ పొందాలనిచైర్ పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి సూచించారు.