హైదరాబాద్ : రాష్ట్రంలో వీధి కుక్కలు(Dog attacks) విజృంభిస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా రోడ్లపై దొరికిన వారిని దొరికినట్లు కరుస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. గుంపులు గుంపులుగా వీధుల్లో సంచరిస్తూ ప్రజలపై పంజా విసురుతూ ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని(Siricilla) ల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నలుగురు చిన్నారులు(Children) ప్రీతిష, వర్షిత్, వరుణతేజ, సహస్ర అనే చిన్నారులు ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.
వెంటనే కుటుంబ సభ్యులు గమనించి కరీంనగర్ హాస్పిటల్లో చేర్పించారు. కాగా, వీధికుక్కల నుంచి రక్షణకు చేపట్టాల్సిన చర్యలపై హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినా ప్రభుత్వం పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులుకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కుక్కల బెడద ఎక్కువ అవుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవు తున్నారు. వీధి కుక్కల బెడద నుంచి తమను రక్షించాలని కోరుతున్నారు.
నలుగురు చిన్నారులపై వీధి కుక్కల దాడి
సిరిసిల్ల – ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నలుగురు చిన్నారులు ప్రీతిష, వర్షిత్, వరుణతేజ, సహస్రలు, ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.
ఈ ఘటనలో నలుగురు చిన్నారులకు తీవ్ర గాయాలుకాగ.. గాయపడిన… pic.twitter.com/7Pm5JHlu32
— Telugu Scribe (@TeluguScribe) August 9, 2024