స్వామిరామానంద తీర్థ సన్యాసి, విద్యావేత్త, కార్మిక నాయకుడు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపనకు ప్రధాన కారకుడు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై నిషేధం కొనసాగుతున్నా.. దాన్ని ధిక్కరించాడు. పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో ఆయనపై ఎన్నో ఆరోపణలు చేశారు. అందులో ఒకటి రామానంద తీర్థకే కాదు.. అక్కడున్నవారందరికీ నవ్వు తెప్పించింది. సత్యాగ్రహం చేస్తున్నప్పుడు స్వామి ఒక ప్రకటన చదవడం ప్రారంభించారు. ఇంతలో పోలీసులు వచ్చారు. ఆయనను అరెస్ట్ చేసి తీసుకుపోయారు. కోర్టులో విచారణ ప్రారంభమైంది. వాళ్లపై పోలీసులు నేరాలు మోపారు. వాటిలో ఒక నేరం విని తీర్థ నవ్వుకున్నారు.
‘పొట్ట నింపుకోవడానికి, పూట గడవడానికి ఇదీ, అదీ అని చెప్పుకోవడానికి ఓ వృత్తంటూ లేకుండా తిరిగే దేశ దిమ్మరి. ఒక తిరుగుబోతు. భిక్షకుడిలా ఇతడూ శిక్షార్హుడే’నని పోలీసులు కోర్టులో చేసిన నేరారోపణల్లో ఒకటి. సన్యాసాశ్రమం స్వీకరించిన తనకు పోలీసులు గొప్ప బిరుదే ఇచ్చారని రామానందతీర్థ చమత్కరించాట. ఈ కేసులో తీర్థకు 18 నెలల జైలు శిక్ష విధించారు. మిగతావారికి కూడా శిక్ష పడింది.