కొవిడ్ రోగులకు తమవంతు సేవ అందించేందుకు ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్ మార్కెటర్లతో పాటు జీఈఎఫ్ ఇండియా ముందుకు వచ్చింది. సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా సేవా భారతితో కలిసి ఉప్పల్ ఆర్వీకే పాఠశాల వద్ద 200 పడకల ఐసొలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫ్రీడమ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ పి.చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో సేవాభారతితో భాగస్వామ్యంతో ఐసొలేషన్ కేంద్రంలో 24 గంటల వైద్యుల పర్యవేక్షణతో పాటు ఆక్సిజన్, టెలీ మెడిసిన్ సేవలతో పాటు ఆహారం, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు.