హైదరాబాద్, ఫిబ్రవరి24 (నమస్తే తెలంగాణ): సీనియర్ ఐపీఎస్లకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 1999 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన స్టీఫెన్ రవీంద్రకు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ప్రమోషన్ కల్పించింది. 2006 బ్యాచ్కు చెందిన కార్తికేయ, రమేశ్నాయుడు, ఏవీ రంగనాథ్, సత్యనారాయణ, సుమతి, ఎం శ్రీనివాసులును ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా పదోన్నతి కల్పించింది.
2010 బ్యాచ్కు చెందిన న్యాలకొండ ప్రకాశ్రెడ్డి, జోయల్ డేవిస్ను డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పొలీస్గా పదోన్నతి కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మరికొందరు నాన్క్యాడర్ ఎస్పీలకూ ప్రమోషన్లు కల్పించినట్టు సమాచారం.