హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): అనుమతుల్లేకుండా నిర్మిస్తున్న భవనాల యజమానులపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయించిం ది. నగరాలు, మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లో గతంలో జీప్లస్2 భవనాలకు తీసుకొన్న అనుమతులతో భారీ భవనాలను నిర్మిస్తున్నవారిపై కఠిన చర్య లు చేపట్టాలని మంత్రి కేటీఆర్ సోమవారం మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్కుమార్కు మరోసారి స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్ల నేతృత్వంలోని టాస్క్ఫోర్స్ కమిటీలు తనిఖీలు నిర్వహించి అక్రమ నిర్మాణాలను కూల్చివేసి నివేదిక అందించాలని ఆదేశించారు. పంచాయతీ ల్లో భవన నిర్మాణాలకు పాత అనుమతులు చెల్లవని, మున్సిపల్ చట్టం 2019తోపాటు టీఎస్బీపాస్ చట్టం ప్రకారం అనుమతులు తీసుకోవాలని చెప్పారు.
బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు
దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని కత్వా చెరువు బఫర్జోన్లో అక్రమంగా విల్లాలు నిర్మిస్తున్నవారిపై పోలీస్ స్టేషన్లో కేసులు నమోదుచేసి రెండు విల్లాల ను కూల్చేశామని, మరో ఐదుగురు కోర్టుకు వెళ్లి స్టే తె చ్చుకొన్నారని సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ వివరించారు. వీటి అనుమతులకు బాధ్యులైన అధికారులపై విచారణకు ఆదేశించి క్రమశిక్షణా చర్యలు చేపట్టామని తెలిపారు. కరీంనగర్ కార్పొరేషన్తోపాటు లక్సెట్టిపేట, బోడుప్పల్, బడంగ్పేట్, తుర్కయాంజల్, నిజాంపేట, మణికొండ మున్సిపాలిటీల్లో సర్వేలు నిర్వహిం చి అక్రమ నిర్మాణాలను తొలగించాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించినట్టు ప్రకటనలో పేర్కొన్నారు.