చేర్యాల;సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం గుర్జకుంటలో చంద్రప్రభుస్వామి తీర్థంకరుడి విగ్రహాలను గుర్తించిన ట్టు చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్రెడ్డి మంగళవారం తెలిపారు. స్థాని క ప్రభుత్వ పాఠశాల సమీపంలోని వ్యవసాయ బావి వద్ద ధ్యాన ముద్ర లో ఉన్న ఒక తీర్థ్థంకరుడి శిల్పం ఉన్నదని, శిరస్సుపై చంద్రవంక ఉండటంతో చంద్రప్రభు స్వామి తీర్థాంకుడి విగ్రహంగా గుర్తించినట్టు తెలిపారు. సాధారణంగా పద్మంపై లేదా కాయోత్సర్గ భంగిమలో తీర్థ్థంకరుని శిల్పం ఉంటుందని.. గుర్జకుంటలో మాత్రమే పద్మం లేకుండా ఆసీనుడై ఉన్నాడని పేర్కొన్నారు.