పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు
హైదరాబాద్లో పేద బ్రాహ్మణ యువతకు ఉచిత ఆన్లైన్ కోచింగ్
తెలుగు యూనివర్శిటీ/రామగిరి/మహబూబ్నగర్/ముస్తాబాద్, ఏప్రిల్ 21: ప్రభుత్వం పెద్దఎత్తున ఉద్యోగాల భర్తీ చేపట్టనుండటంతో వివిధ వర్గాల అభ్యర్థుల కోసం గురువారం కూడా పలు శిక్షణా కేంద్రాలు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారుల చేతులమీదుగా ప్రారంభమయ్యాయి. బ్రాహ్మణ అఫీషియల్స్, ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన ఉచిత ఆన్లైన్ కోచింగ్ వెబ్సైట్ను చిరాగ్అలీలేన్లోని అసోసియేషన్ కార్యాలయంలో ఎమ్మెల్సీ వాణిదేవి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తుండటంతో బ్రాహ్మణ యువతీయువకులు ఈ కోచింగ్ సెంటర్ ద్వారా శిక్షణ పొంది ఉద్యోగాలను సాధించాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు రాధాకృష్ణమూర్తి, కన్వీనర్ సునీల్కుమార్, ప్రధా న కార్యదర్శి డాక్టర్ వింజమూరి సుధాకర్, నీలకంఠం, డాక్టర్ నరసరాజు తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండలో మానస ఫౌండేషన్ సహకారంతో
కంచర్ల మానస ఫౌండేషన్ సహకారంతో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు నల్లగొండలోని భవిత ఇన్స్టిట్యూట్లో నిర్వహించే గ్రూప్స్, ఎస్ఐ, కానిస్టేబుల్, టెట్, టీఆర్టీ ఉచిత శిక్షణను గురువారం జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో మంత్రి జగదీశ్రెడ్డి ప్రారంభించారు. నల్లగొండ పోలీస్ ఆడిటోరియంలో పోలీస్ శా ఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత శిక్షణ శిబిరాన్ని ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్జీవన్ పాటిల్, ఎస్పీ రెమా రాజేశ్వరితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత పాలకులు హైదరాబాద్ను ఫ్రీజోన్గా మార్చి ఆంధ్రవాళ్లతో ఇక్కడి ఉద్యోగాలు భర్తీ చేశారన్నారు. వీటిని అధిగమించేలా రాష్ట్రపతి ఉత్తర్వులను సీఎం కేసీఆర్ తీసుకురావడానికి ఏడేండ్లు పట్టిందని తెలిపారు. కా ర్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, భవిత శిక్షణ సంస్థ డైరెక్టర్ టీ వెంకట్రెడ్డి, రెడ్క్రాస్ సంస్థ చైర్మన్ గోలి అమరేందర్రెడ్డి పాల్గొన్నారు.
మహబూబ్నగర్లో శాంతా ట్రస్ట్ ఆధ్వర్యంలో
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని చేనేత ఎక్స్పోలో శాంతా నారాయణగౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం సహకారంతో ఏర్పాటు చేసిన గ్రూప్స్ పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ కేం ద్రాన్ని మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ స్వరాష్ట్రం ఏర్పడ్డాక లక్షా 33 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. స్థానికులకే ఎక్కువగా ఉద్యోగాలు వచ్చేలా 95 శాతం రిజర్వేషన్ కల్పించినట్టు గుర్తు చేశారు. కార్యక్రమాల్లో రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇషాక్, కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, జిల్లా అధికారులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ముస్తాబాద్లో కేటీఆర్ ఉచిత శిక్షణ శిబిరం
సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని మాతృశ్రీ గార్డెన్లో ఎంపీపీ జనగామ శరత్రావు ఏర్పాటుచేసిన ‘కేటీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్ను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎస్పీ రాహుల్ హెగ్డే ప్రారంభించారు. అభ్యర్థులకు పోలీస్శాఖ నుంచి అన్ని విధాలా సహకారం ఉంటుందన్నారు. ఎంపీపీ జనగామ శరత్రావు మాట్లాడుతూ దాతల సహకారంతో గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇచ్చి పోటీ పరీక్షల్లో రాణించేలా తీర్చిదిద్దుతామని, శిక్షణతోపాటు ఒకపూట భోజనం పెడతామని, స్టడీ మెటీరియల్ అందిస్తామని చెప్పారు. అనంతరం సెస్ డైరెక్టర్గా ఎన్నికైన కొమ్ము బాలయ్యను ఉస్మానియా యూనివర్సిటీ పాలకవర్గ సభ్యుడు ఎస్విసీ ప్రకాశ్ సన్మానించారు. ఇక్కడ జడ్పీటీసీ గుండం నర్సయ్య, ఏఎంసీ చైర్పర్సన్ శీలం జానాబాయి, స ర్పంచు చాకలి రమేశ్, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అక్కరాజు శ్రీనివాస్, నాయకులు బత్తుల అంజయ్య, సెస్ మాజీ డైరెక్టర్ ఏనుగు విజయరామారావు, గాంధీ, రాంచంద్రం, సిరిసిల్లా రూరల్ సీఐ ఉపేంద్ర, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.