హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): అవయవదానం మరొకరి జీవితానికి పునర్జన్మను ఇస్తుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. జాతీయ అవయవదాన దినోత్సవాన్ని పురసరించుకొని హైదరాబాద్లోని కమిషన్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
మరణానంతరం అవయవదానం చేస్తామని అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. 2022లో అవయవదానంలో తొలిస్థానంలో నిలిచిన తెలంగాణకు ‘స్టేట్ విత్ హయ్యస్ట్ నంబర్ ఆఫ్ డిసీజ్డ్ డోనర్స్’ అవార్డును కేంద్రం అందజేసిందని చెప్పారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ డైరెక్టర్ శారద, సెక్రటరీ కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.