హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో వన్యప్రాణుల సంరక్షణ, సమతుల్యత పర్యవేక్షణ కోసం ప్రభుత్వం రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. సీఎం చైర్పర్సన్గా, అటవీశాఖ మంత్రి ఉపాధ్యక్షుడిగా 13 మంది సభ్యులతో ఏర్పాటైన ఈ కమిటీ మూడేండ్లపాటు కొనసాగుతుందని బుధవారం జారీచేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొన్నది.