హైదరాబాద్, జనవరి10 (నమస్తే తెలంగాణ): గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీబంధు పథకాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా యథావిధిగా అమలు చేయాలని నాయీబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. బీసీబంధు పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు రూ.లక్ష చొప్పున చెకులను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కులవృత్తిదారులు ఆధునిక యంత్ర పరికరాలు, ముడిసరుకును కొనుగోలు చేసుకునేందుకు వీలుగా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా వచ్చే బడ్జెట్లో చేతివృత్తులపైన ఆధారపడిన కులాలకు అధిక మొత్తంలో బడ్జెట్ కేటాయించాలని సీఎం రేవంత్రెడ్డిని కోరారు.