హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): ప్రజలు, ప్రజాప్రతినిధులు రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పిలుపునిచ్చారు. రాజ్యాంగం వల్లే దేశంలో ప్రజాస్వామ్యానికి గట్టి పునాదులు పడ్డాయని చెప్పారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం దళిత, గిరిజన, మైనార్టీ అడ్వకేట్స్ సంఘాల ప్రతినిధులతో మంత్రుల నివాసంలో వినోద్కుమార్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా భారత రాజ్యాంగానికి అత్యంత గౌరవ స్థానముందని, ఆ ఘనత రాజ్యాంగ నిర్మాతలకు, ముఖ్యంగా బీఆర్ అంబేదర్కు దకుతుందని కొనియాడారు. రాష్ట్రాల సమూహమే భారతదేశం అనే స్ఫూర్తి రాజ్యాంగంలో ఉన్నదని, కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల హకులను యథేచ్ఛగా కాలరాస్తున్నదని మండిపడ్డారు. ముఖ్యంగా ప్రధాని మోదీ ఇటీవల అనుసరిస్తున్న చర్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ఉన్నాయని విమర్శించారు. ప్రస్తుత దేశ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని యువత మేలొని రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.