రాష్ట్ర ఆయిల్ ఫెడ్.. స్వచ్ఛమైన గానుగ నూనెను వినియోగదారుల కోసం అందుబాటులోకి తెచ్చింది. ఈ నూనెను ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డితో కలిసి విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి బుధవారం హైదరాబాద్లోవిడుదల చేశారు.
వినియోగదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి రసాయనాలు లేకుండా గానుగ నూనెను తయారు చేస్తున్నట్టు తెలిపారు.