హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): ఆర్డీఎస్ ద్వారా వాటా మేరకు తెలంగాణకు నీళ్లు రావడం లేదని, వెంటనే ఆధునీకరణ పనులు చేపట్టాలని తుంగభద్ర నదీ యాజమాన్య బోర్డు (టీఆర్ఎంబీ)ను ఈఎన్సీ సీ మురళీధర్ కోరారు. టీఆర్ఎంబీ చైర్మన్ డీఎం రాలపూరే అధ్యక్షతన శుక్రవారం హైదరాబాద్లో బోర్డు సమావేశం జరిగింది. కర్ణాటక అధికారులు మాట్లాడుతూ.. బచావత్ ట్రిబ్యునల్ ఆధారంగా తాగునీటి అవసరాల కోసం తీసుకునే నీటిని 20% మాత్రమే లెకించాలని కోరారు. దీనిపై ఏపీ అభ్యంతరం తెలిపింది. బచావత్ ట్రిబ్యునల్ నాటి పరిస్థితులు వేరని, ఇప్పుడు నీటి అవసరాలు పెరిగినందువల్లే లేవనెత్తుతున్నామని కర్ణాటక బదులిచ్చింది. కృష్ణా బోర్డు సమావేశంలోనూ తెలంగాణ ఇదే అంశాన్ని లేవనెత్తిందని చైర్మన్ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో 20% లెక్కింపు అంశంలో నిర్ణయం తీసుకోవాలని కేంద్ర జల వనరుల శాఖకు లేఖ రాయనున్నట్టు తెలిపారు.