హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాల్లో వయోజన విద్య కార్యక్రమాల అమలు, పర్యవేక్షణకు ప్రత్యేకంగా స్టేట్ లిటరసీ సెంటర్ (రాష్ట్ర అక్షరాస్యత కేంద్రం)ను ఏర్పాటు చేయాలని కేంద్ర విద్యాశాఖ సూచించింది. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ)లో దీనిని ఏర్పాటు చేయాలని పేర్కొన్నది.
ఈ మేరకు స్టేట్ లిటరసీ సెంటర్ ఏర్పాటు మార్గదర్శకాలను సోమవారం కేంద్రం విడుదల చేసింది. 2021లో నేషనల్ లిటరసీ సెంటర్ను ఢిల్లీలో ప్రారంభించారు. ఇదే తరహాలో రాష్ట్రస్థాయిలోనూ నెలకొల్పాలని ఎన్సీఈఆర్టీ ప్రతిపాదించింది. ఈ సెంటర్కు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఎక్స్ఆఫిషియో చైర్మన్గా, రాష్ట్ర అక్షరాస్యత మిషన్ అథారిటీ డైరెక్టర్ వైస్ చైర్మన్గా, ప్రొఫెసర్ సభ్యకార్యదర్శిగా, ఇద్దరు ఎస్సీఈఆర్టీ ప్రొఫెసర్లు సభ్యులుగా ఉంటారు.