హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముస్లిం సోదరులకు సీఎం కేసీఆర్ ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. ఈ నెల 29న సాయంత్రం 6.10 గంటలకు ఎల్బీ స్టేడియంలో ముస్లిం మతపెద్దల సమక్షంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు, ప్రజలు పాల్గొనే ఈ ఇఫ్తార్ విందుకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘తెలంగాణ రాష్ట్రం నేడు మత సామరస్యానికి, గం గా జమున తెహజీబ్కు వేదికగా నిలిచింది. సర్వ మతాల సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యమిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తున్నది. ముస్లిం మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం కోసం పలు పథకాలను అమలు పరుస్తున్నది. లౌకికవాదాన్ని కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది’ అని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఒక సందేశంలో పేర్కొన్నారు.
రంజాన్ ఏర్పాట్లపై నేడు మంత్రి కొప్పుల సమీక్ష
ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇవ్వనున్న ఇఫ్తార్ విందు ఏర్పాట్లపై మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదివారం ఎల్బీ స్టేడియయంలో ఉదయం 11 గం టలకు మైనార్టీ సంక్షేమశాఖ అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించనున్నారు. గిఫ్ట్ ప్యాక్ల పంపిణీ, ఇఫ్తార్ విందుల ఏర్పాట్లపై చర్చించనున్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకు ని తెలంగాణ ప్రభుత్వం ఏటా నిరుపేద ముస్లింలకు వస్ర్తాలతోపాటు, గిఫ్ట్ ప్యాక్లను అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ ఏడాది కూడా సుమారు 5 లక్షల మంది పేద ముస్లింలకు ‘తోఫా’ అందించనున్నది.