జనగామ : జిల్లాలోని స్టేషన్ ఘనపూన్లో బీజేపీ భారీ షాక్ తగిలింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేక అపసోపాలు పడుతున్న ఆ పార్టీని ఒక్కొక్కరు వీడుతున్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మదాసు వెంకటేష్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. గురువారం స్టేషన్ ఘనపూర్ బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. 2018లో రాజకీయ అరంగేట్రం చేసిన తాను సొంత డబ్బులతో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశానని తెలిపారు. ఇందిరకు టికెట్ రావడంతో, ఇండిపెండెంట్గా పోటీ చేసినట్లు తెలిపారు.
అనంతరం బీజేపీలో చేరినట్లు వివరించారు. నియోజకవర్గంలో 3000 మందికి ఆర్థిక సాయం పార్టీని బలోపేతం చేసేందుకు ఎంతో కష్టపడ్డానని చెప్పారు. బీజేపీ టికెట్ జి.విజయరామారావుకు ఇచ్చేటప్పుడు కనీసం తనకు సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. నాలుగేండ్లుగా గ్రామాల్లో బీజేపీకి పార్టీ గద్దెలు కట్టిస్తే నాకు ఏమీ ఇవ్వకుండా అవమానించిందన్నారు. అందుకే బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. బీజేపీకి నాకు ఎలాంటి సంబధం లేదని ఇక మళ్లీ బీజేపీలో కొనసాగే ప్రసక్తేలేదన్నారు. భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానని వెంకటెష్ తెలిపారు.