హైదరాబాద్ : మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. తన జన్మదినాన్ని పురస్కరించుకొని రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మేడిపల్లి గ్రామంలోని తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఉప్పల మాట్లాడుతూ..గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నా వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయమన్ని ఎంపీ సంతోష్ కుమార్ను ప్రశంసించారు.