మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో అంగీకారం
ఎస్పీడీసీఎల్ ఉత్తర్వులు జారీ
కాంట్రాక్టర్స్ అసోసియేషన్ హర్షం
హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు పనుల స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లను (ఎస్ఎస్ఆర్) 25 నుంచి 30 శాతం మేర పెంచేందుకు టీఎస్ఎస్పీడీసీఎల్ అంగీకరించింది. విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి చొరవతో తెలంగాణ కాంట్రాక్టర్స్ అసోసియేషన్తో సంస్థ సీఎండీ జీ రఘుమారెడ్డి చర్చలు జరిపారు. అసోసియేషన్ డిమాండ్ల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసిన ఎనిమిది మంది సభ్యుల కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన అనంతరం ఎస్ఎస్ఆర్ ధరలను పట్టణ ప్రాంతాల్లో 30%, గ్రామీణ ప్రాం తాల్లో 25% పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. ఐదేండ్ల నుంచి ఎస్ఎస్ఆర్ ధరలను పెంచాలని కాం ట్రాక్టర్లు కోరుతున్నారు.
ధరల పెంపు పట్ల తెలంగాణ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శివకుమార్, ఎస్కే మాజిద్ హర్షం వ్యక్తంచేశారు. ఇం దుకు సీఎం కేసీఆర్తోపాటు మంత్రి జగదీశ్రెడ్డి, ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు, రఘుమారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. పెంపుదలకు చొరవ చూపిన మంత్రి జగదీశ్రెడ్డిని మినిస్టర్స్ క్వార్టర్స్లోని ఆయన నివాసంలో శనివారం సన్మానించారు. కార్యక్రమంలో విద్యుత్తు బోర్డ్ సభ్యులు సదానందం, పర్వతాలు, భిక్షమయ్య, బాలునాయక్, శ్రీనివాస్గౌడ్, యాదగిరి, సత్తిరెడ్డి, మల్లేశ్ పాల్గొన్నారు.
పాత పెన్షన్ విధానం అమలు చేయాలి
1999 తర్వాత విద్యుత్తు సంస్థల్లో చేరిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని కోరుతూ తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఫోరం ప్ర తినిధులు రఘుమారెడ్డికి వినతిపత్రం సమర్పించారు.