హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): ఎస్సీటీ ఎస్సై (సివిల్), ఎస్సీటీ ఎస్సై (ఐటీఅండ్సీవో), ఎస్సీటీ ఎస్సై (పీటీవో) ఎస్సీటీ ఏఎస్సై (ఎఫ్పీబీ)కి సంబంధించిన తుది రాత పరీక్షలను 8, 9 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి శనివారం తెలిపింది. 3వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 6వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు అభ్యర్థులు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించినట్టు బోర్డు పేర్కొన్నది. 8న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్సీటీ ఎస్సై, ఏఎస్సైలకు ఆర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ పరీక్ష, మధ్యాహ్నం ఇంగ్లిష్ లాంగ్వేజ్ పరీక్ష ఉంటుందని చెప్పింది.
9న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎస్సీటీ ఎస్సై (సివిల్) అభ్యర్థులకు జనరల్ స్టడీస్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు తెలుగు/ఉర్దూ లాంగ్వేజ్ పేపర్ ఉంటుందని వివరించింది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. హాల్టికెట్స్ డౌన్లోడ్స్లో ఏమైనా సమస్యలుంటే support@tslprb.inకు ఈమెయిల్ పంపవచ్చని, మరిన్ని వివరాలకు 9393711110, 9391005006ను సంప్రదించవచ్చని సూచించారు.