హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): పదో తరగతి, ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఇంటర్ పరీక్షలకు 3,55,143 మంది విద్యార్థులు హాజరుకానుండగా, 855 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ఇంటర్బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు.
పది పరీక్షలకు 55,662 మంది విద్యార్థులు హాజరుకానుండగా, 204 కేంద్రాలను ఏర్పాటుచేసినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు.