హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చరిత్రలో జూలైలో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం లభించింది. జూలై నెలలో 23.40 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీకి రూ.139.33 కోట్ల ఆదాయం సమకూరింది. 1.07 కోట్ల శ్రీవారి లడ్లను విక్రయించారు.
శ్రీవారికి 10.97 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇదిలా ఉండగా.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. గురువారం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 16 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. బుధవారం తిరుమల శ్రీవారిని 74,497 మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.