హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్లను సోమవారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఈ నెల 12 నుంచి 31 వరకు, ఫిబ్రవరి నెలకు సంబంధించిన రూ.300 టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు.
శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను ఈ నెల 12 నుంచి గతంలో మాదిరిగానే తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్సు, శ్రీనివాసం, గోవిందరాజస్వామి రెండో సత్రంలో జారీ చేస్తామని టీటీడీ తెలిపింది.