హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): వినియోగదారులు విద్యుత్తు వృథాను అరికట్టి బిల్లులను తగ్గించుకోవాలని విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) చైర్మన్ శ్రీరంగారావు ఒక ప్రకటనలో సూచించారు. డిస్కంలు అధిక ధరలు వెచ్చించి విద్యుత్తును కొనుగోలు చేస్తున్నాయని, కొన్ని సమయాల్లో ఒక్కో యూనిట్ను రూ.12 వెచ్చించి కొనుగోలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు విద్యుత్తు ఆదా కోసం ఆయన పలు సూచనలు చేశారు.
విద్యుత్తు ఆదా ఇలా..