హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జ్ఞాపకార్థం పోస్టల్ స్టాంప్ ముద్రించి విడుదల చేయాలని హైదరాబాద్ పోస్టల్ రీజియన్ పోస్ట్ మాస్టర్ పీవీఎస్ రెడ్డికి రాష్ట్ర సాంస్కృతికశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ బుధవారం లేఖ రాశారు. దక్కన్ ప్రాంతంలో అత్యంత ప్రభావశీలుడైన పాపన్నగౌడ్ అందించిన సేవలు, స్ఫూర్తి భవిష్యత్తు తరాలకు తెలిసేలా స్టాంప్ ఉండాలని లేఖలో కోరారు. పాపన్నగౌడ్ జయంతిని ఆగస్టు 18న అధికారికంగా నిర్వహించినట్టు గుర్తుచేశారు.