హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): భారత జాగృతి ఆస్ట్రేలియా అధ్యక్షుడిగా శ్రీకర్రెడ్డి అందెం నియమితులయ్యారు. గురువారం భారత జాగృతి ఆస్ట్రేలియా ఎగ్జిక్యూటివ్ కమిటీని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. అధ్యక్షుడిగా శ్రీకర్రెడ్డి, ఉపాధ్యక్షులుగా తన్వి గోయల్, అరుణ్కుమార్ వెనుకంటి, కార్యదర్శిగా అంజనీ సుంకిశాల, సహాయ కార్యదర్శులుగా మన్ప్రీత్ సింగ్, రామకృష్ణ, ట్రెజరర్గా స్వాతి ధనగిరి, కల్చరర్ కో ఆర్డినేటర్గా బాలు తానాజీ, యూత్ కోఆర్డినేటర్గా విరించి యక్కంటి, స్టూడెంట్ కోఆర్డినేటర్గా ఆశ్రిత్ కోరబోయిన నియమితులయ్యారు.
అదేవిధంగా ఐదుగురిని ఆస్ట్రేలియా స్టేట్ కోఆర్డినేటర్లను నియమించారు. యాక్ట్ కోఆర్డినేటర్గా మంజూష బల్మూరి, క్విన్స్లాండ్ కోఆర్డినేటర్గా ప్రీతమ్ కృష్ణ, సౌత్ ఆస్ట్రేలియా కోఆర్డినేటర్గా వెంకట్ లింగపల్లి, విక్టోరియా కో ఆర్డినేటర్గా గౌరవ్ రాహి, వెస్టెర్న్ ఆస్ట్రేలియా కో ఆర్డినేటర్గా సతీశ్ వడ్డేపల్లి నియమితులయ్యారు.