Heart Attack | రఘునాథపాలెం, జూలై 10: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మానుకొండ రాధాకిశోర్ తనయుడు శ్రీధర్ (28) సోమవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందాడు. శ్రీధర్ కొన్నేండ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దవాఖానలో చికిత్స పొందిన తర్వాత ఇంట్లోనే తల్లిదండ్రులతో కలిసి విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆదివారం బంధువుల ఇంట్లో శుభాకార్యానికి వెళ్లిన శ్రీధర్ రాత్రి ఇంటికి వచ్చాడు.
సోమవారం ఉదయం రోజుమాదిరిగానే జిమ్కి వెళ్లాడు. ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే శ్రీధర్కు గుండెపోటు వచ్చింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే నగరంలోని ఓ దవాఖానకు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారని కుటుంబ సభ్యులు తెలిపారు. బాధిత కుటుంబాన్ని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పరామర్శించారు. మృతుడి తల్లిదండ్రులను ఓదార్చారు.