హైదరాబాద్: సింగరేణి (Singareni) సీఎండీ శ్రీధర్ పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఈ నెల 1 నుంచి మరో ఏడాది పాటు పదవీకాలం పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2015, జనవరి 1 నుంచి ఆయన సంస్థ సీఎండీగా కొనసాగుతున్నారు. 2017లో ఆయన రెండేండ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకున్నారు. అప్పటినుంచి ప్రతి ఏడాది ఆయన పదవీకాలాన్ని ప్రభుత్వం పొడిగిస్తూ వస్తున్నది. తాజాగా జనవరి 1న ఆయన పదవీకాలం ముగియడంతో మరోసారి ఎక్స్టెన్షన్ పొందారు.