హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): మీ సేవ ద్వారా స్థానిక వ్యాపారులు డిజిటల్ మార్కెటింగ్ సహాయం కోరేలా కొత్త పోర్టల్, హెల్ప్లైన్ నంబర్ను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు ప్రారంభించారు. బుధవారం గచ్చిబౌలిలో మీ సేవా డిజిటల్ మార్కెటింగ్ శిక్షణ రెండో దశ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి మీ సేవ కేంద్రాన్ని డిజిటల్ మార్కెటింగ్ హబ్గా తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు.
రాష్ట్రంలో 5వేలకు పైగా మీ సేవ కేంద్రాలు ఉన్నాయని, వీటి ద్వారా చిన్న వ్యాపారులకు డిజిటల్ మార్కెటింగ్ అవకాశాలను చేరువ చేయొచ్చని తెలిపారు. డిజిటల్ మార్కెటింగ్కు meeseva.telangana.gov.in పోర్టల్ను సందర్శించాలని, ఎంక్వైరీలకు 1100/1800-425-1110 టోల్ఫ్రీ నంబర్ను సంప్రదించాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.