మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావును శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇవాళ హైదరాబాద్లోని హరీశ్రావు నివాసానికి వచ్చిన స్వామిజీ.. ఆయనకు ఆశీస్సులు అందజేశారు.
అనంతరం కోకాపేట నియోపోలిస్లోని శ్రీ రాజశ్యామల దేవస్థానంలో ఈ నెల 19 న జరగనున్న ప్రభవ నామ సంవత్సర ఉగాది ఆస్థానం, అలాగే 27న జరగనున్న శ్రీరామనవమి వేడుకలకు హాజరుకావాల్సిందిగా హరీశ్ రావును స్వామిజీ సాదరంగా ఆహ్వానించారు.
శ్రీ రాజశ్యామల అమ్మవారి కృపాకటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపై మెండుగా ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా హరీశ్ రావు మనస్ఫూర్తిగా ప్రార్థించారు.