వరంగల్ : శ్రీ సీతారాముల జీవితం ప్రపంచానికి ఆదర్శమని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli) అన్నారు. శ్రీ రామ నవమి(Sri Rama Navami) వేడుకల సందర్భంగా వరంగల్ జిల్లా(Warangal District) పర్వతగిరి, రాయపర్తి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు, తొర్రూరు, నాంచారి మడూరు, తదితర దేవాలయాల్లో జరిగిన కల్యాణోత్సవాలకు ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావుతో కలసి హాజరయ్యారు.
వల్మీడికి భద్రాచలానికి మించిన వైభోగం రాబోతుందని పేర్కొన్నారు.పాలకుర్తి, బమ్మెర, వల్మీడి ల పై సీఎం కేసీఆర్(CM KCR) ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసే అవకాశం దక్కడం తన అదృష్టంమని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నే దేవాలయాలకు పూర్వ వైభవం వస్తుందని అన్నారు.ప్రముఖ చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా వల్మీడి దేవాలయం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు.