మహబూబాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు గురువారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయాలను అందంగా విద్యుద్దీపాలు, పూలతో అలంకరించారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
మహబూబాబాద్(Mahaboobabad) జిల్లా కేంద్రం గాంధీ పార్క్ ( మిథిలా నగరము) వద్దగల రామ మందిరంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavati Rathod), ఎమ్మెల్యే శంకర్ నాయక్ దంపతులు, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి దంపతులు, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు పాల్గొని పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున మంత్రి సత్యవతి రాథోడ్ స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
వరంగల్ జిల్లా పర్వతగిరి, మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం మాటేడు, తొర్రూరు, నాంచారి మడూరు, వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి తదితర దేవాలయాల్లో కళ్యాణోత్సవాలకు మంత్రి హాజరయ్యారు.