OU Doctorates | హైద్రాబాద్ శివారుల్లోని ఘట్ కేసర్ పట్టణ వాసులు టీ శ్రీలక్ష్మి, యాదగిరి దంపతులు ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పట్టాలను అందుకున్నారు. చరిత్ర విభాగంలో శ్రీలక్ష్మి, తెలుగు విభాగంలో యాదగిరికి యూనివర్సిటీ డాక్టరేట్ ప్రధానం చేసింది. వీరిద్దరిని యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ సీనియర్ ప్రొఫెసర్ అర్జున్రావు కుతాడి అభినందించారు.
టీ శ్రీలక్ష్మి మూడు సంవత్సరాలలోనే తన రీసెర్చ్ను కంప్లీట్ చేయడం ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర విభాగంలోనే అరుదైన సంఘటన అర్జున్ రావు కుతాడి పేర్కొన్నారు. సహజంగా ఒక రీసెర్చ్ స్కాలర్
తన పరిశోధనను మూడేండ్ల నుండి ఐదేండ్ల లోపు ముగించాలని, కానీ శ్రీలక్ష్మి తన రీసెర్చ్ను మూడేండ్లలోనే పూర్తిచేసి, డాక్టరేట్ పట్టా అందుకోవడం, అలాగే గురుకుల డిగ్రీ కాలేజీ హిస్టరీ లెక్చరర్గా గవర్నమెంట్
ఉద్యోగం సాధించడం ఆదర్శప్రాయమని కొనియాడారు.
నిరుపేద కుటుంబంలో తొట్టెంపూడి సుబ్బారావు, తొట్టెంపూడి ప్రమీలారాణి దంపతులకుహైదరాబాద్లో
జన్మించిన శ్రీలక్ష్మి ఉస్మానియా యూనివర్సిటీలో ఎం ఏ (హిస్టరీ) పూర్తిచేశారు. యూజీసీ-2019లో నిర్వహించిన నెట్ పరీక్షలో (నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్) ఉత్తీర్ణత సాధించి, రీసెర్చ్ ఫెలోషిప్కు ఎంపికయ్యారు. తర్వాత 2020లో చరిత్ర శాఖలో తన పరిశోధన ప్రారంభించారు. సీనియర్ ప్రొఫెసర్ అర్జున్రావు కుతాడి పర్యవేక్షణలో (గైడ్) ‘ది రోల్ ఆఫ్ దళిత్ విమెన్ – సోషల్ రిఫార్స్స్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అండ్ తెలంగాణ మూవ్మెంట్’ అనే టాపిక్తో శ్రీలక్ష్మి తన పరిశోధన సిద్ధాంత గ్రంథాన్ని యూనివర్సిటీకి సమర్పించారు. ఈ పరిశోధనకుగా ఉస్మానియా యూనివర్సిటీ శ్రీలక్ష్మికి డాక్టరేట్ పట్టాను ప్రధానం చేసింది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత, తెలంగాణ అస్తిత్వ చరిత్రను పలుకోణాల్లో రాసేందుకు రచయితలు, పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణ నిర్మాణంలో పునాదిరాళ్లుగా మిగిలి, ఏ గుర్తింపుకు నోచుకోని దళిత స్రీలకు చరిత్రలో స్థానం కల్పించడానికి పరిశోధకురాలు శ్రీలక్ష్మి చేసిన ప్రయత్నం విజయవంతమైందని ఆర్ట్స్ కాలేజి ప్రిన్సిపాల్ సీనియర్ ప్రొఫెసర్ అర్జున్రావు, హిస్టరీ డిపార్ట్మెంట్ హెడ్ ప్రొఫెసర్ లావణ్య, ప్రొ ఇందిర, అసిస్టెంట్ ప్రొఫెసర్ రమేష్ అభినందించారు.

వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెంబర్-1లో తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూ పరిశోధన పూర్తి చేయడం ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి అనే నానుడిని నిరూపించారని యాదగిరిని ప్రిన్సిపాల్ అర్జున్రావు కుతాడి కొనియాడారు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం నాగ సముందర్ గ్రామంలో పైళ్ల నర్సిములు, అనంతమ్మ దంపతులకు జన్మించిన యాదగిరి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ (తెలుగు) పూర్తి చేశారు. యూజీసీ నిర్వహించే నెట్ పరీక్షలో (నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ – 2012)లో ఉత్తీర్ణులయ్యారు. అదే ఏడాది ప్రభుత్వ తెలుగుభాషా ఉపాధ్యాయుడుగా ఉద్యోగంలో చేరారు. 2017లో తెలుగు శాఖలో తన పరిశోధన ప్రారంభించారు. డాక్టర్ అన్నదానం వేంకట సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో ‘భండారు సదాశివరావు సాహిత్యం – సమగ్ర పరిశీలనం’ అనే టాపిక్తో యాదగిరి తన పరిశోధన సిద్దాంత గ్రంథాన్ని యూనివర్సిటీకి సమర్పించారు. ఈ పరిశోధనకుగాను ఉస్మానియా యూనివర్సిటీ యాదగిరికి డాక్టరేట్ పట్టాను ప్రధానం చేసింది.
భండారు సదాశివరావు వరంగల్ పట్టణ వాసి. స్వాతంత్య్ర సమరయోధులు. జాతీయవాద కవి. వీరు 22కు పైగా రచనలు చేశారు. జాతీయ సాహిత్య పరిషత్ అనే సంస్థను తెలుగు ప్రాంతంలో ప్రారంభించి, దేశ భక్తి సాహిత్యాన్ని కవులను సదాశివరావు తీర్చిదిద్దారు. 1925లో జన్మించిన సదాశివరావు శతజయంతి ఉత్సవాలకు చేరువలో ఉన్న సమయంలో సదాశివరావు జీవితం వారి సాహిత్యంపై పరిశోధన గ్రంథం రావడం జాతీయవాదులకు ఆనందాన్ని కలిగించే అంశమని ఉస్మానియా యూనివర్శిటీ తెలుగు డిపార్ట్మెంట్ హెడ్ ప్రొఫెసర్ సాగి కమలాకర శర్మ, బీవోఎస్ ప్రొ. ఏలే విజయలక్ష్మీ ప్రొ. చింతకింది కాశీం, ప్రొ. సూర్యాధనుంజయ్, ప్రో రఘు అభినందించారు. డాక్టరేట్ పట్టాతోపాటు డిగ్రీ లెక్చరర్ ఉద్యోగం పొందిన శ్రీలక్ష్మిని, యాదగిరి డాక్టరేట్ పట్టా సాధించినందుకు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు అభినందించారు.