BS Rao | హైదరాబాద్ : శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బీఎస్ రావు(75) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బీఎస్ రావు గురువారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. మరికాసేపట్లో రావు భౌతికకాయాన్ని విజయవాడకు తరలించనున్నారు. బీఎస్ రావు పూర్తి బొప్పన సత్యనారాయణ రావు. బీఎస్ రావు దంపతులు ఇంగ్లండ్, ఇరాన్లో వైద్యులుగా సేవలందించారు.
1986లో శ్రీ చైతన్య విద్యా సంస్థలను బీఎస్ రావు ప్రారంభించారు. మొదటిసారిగా విజయవాడలో బాలికల జూనియర్ కాలేజీని స్థాపించారు. విజయవాడ నుంచి ఇతర ప్రాంతాలకు అంచెలంచెలుగా విస్తరించారు. 321 జూనియర్ కాలేజీలు, 322 టెక్నో స్కూల్స్, 107 సీబీఎస్ఈ స్కూల్స్ను స్థాపించారు. శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో 8.5 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.