హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ) : కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల శాశ్వత కేటాయింపు ప్రక్రియలో మిగిలిన 13 జిల్లాల్లో స్పౌజ్ (ఉద్యోగ దంపతులు) సమస్యను పరిష్కరించాలని పీఆర్టీయూ టీఎస్ ప్రభుత్వాన్ని కోరింది. ఉద్యోగ దంపతులను ఒకే జిల్లాకు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. బుధవారం సచివాలయంలో సీఎస్ సోమేశ్కుమార్కు ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్రెడ్డి, ప్రధానకార్యదర్శి బీరెల్లి కమలాకర్రావు వినతిపత్రం అందజేశారు. యాజమాన్యాల వారీగా, కొత్త జిల్లాల సీనియార్టీ ప్రాతిపదికన టీచర్ల పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని కోరారు. ఆన్లైన్లో పరస్పర బదిలీల కోసం స్వీకరించిన దరఖాస్తులను పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.