హైదరాబాద్ : అమెరికాలో మూడేళ్ల ‘మాస్టర్స్ ఆఫ్ సైన్స్ ఇన్ లీడర్షిప్, మేనేజ్మెంట్ ఆఫ్ టెక్నాలజీ’ కోర్సు చేయాలనుకుంటున్న తెలంగాణ, ఏపీలోని విద్యార్థులకు యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ లాస్ ఏంజిల్స్ శుభవార్త చెప్పింది. వచ్చే విద్యా సంవత్సరానికి భారీ స్కాలర్షిప్లు ఇవ్వడంతో పాటు ప్రపంచంలోనే అగ్రగామి యూనివర్సిటీ ఇక్కడకే వచ్చి విద్యార్థులకు స్పాట్ అడ్మిషన్లు ఇవ్వనున్నది. తెలంగాణ విద్యార్థుల కోసం హైదరాబాద్లో మంగళవారం, ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు విజయవాడలో బుధవారం ఈ స్పాట్ అడ్మిషన్ల కార్యక్రమాలను నిర్వహించనున్నది. సుమారు 50 మంది వరకు విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వనున్నారు.
కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్లో ఉండే ‘ద యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ లాస్ ఏంజిల్స్ (UWLA) హైదరాబాద్లో ఈ నెల 24న విద్యార్థుల, 25న విజయవాడలో అడ్మిషన్లు ఇవ్వనున్నది. యూడబ్ల్యూఎల్ఏ ప్రెసిడెంట్ డాక్టర్ రాబర్ట్ డబ్ల్యూ బ్రౌన్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ స్ట్రాటజిక్ ఆఫీసర్ డాక్టర్ లాటర్ బ్రౌన్ స్వయంగా భారతీయ విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. 1966లో స్థాపించిన యూనివర్సిటీకి అత్యున్నత నాణ్యతతో, అందుబాటులో ఉండే ఫీజులతో, చాలా సౌలభ్యంగా ఉండే విద్యావిధానంతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. గూగుల్, అమెజాన్ లాంటి ఐటీ దిగ్గజాల కార్యాలయాలకు అత్యంత సమీపంలో ప్రధాన కార్యాలయం ఉన్న ఈ విద్యాసంస్థ 8వేల డాలర్ల వరకు స్కాలర్షిప్ అందిస్తోంది. మొత్తం మాస్టర్స్ కోర్సుకు 24,500 డాలర్ల ఖర్చయితే, అందులో మొత్తం 16,500 డాలర్ల ట్యూషన్ ఫీజులో ఈ మొత్తం తగ్గనున్నది.