హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని డిసెంబర్ 3న రవీంద్రభారతిలో అధికారికంగా నిర్వహించనున్నట్టు దివ్యాంగుల సంక్షేమశాఖ డైరెక్టర్ బీ శైలజ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దివ్యాంగులకు ఈ నెల 29న రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. డిసెంబర్ 2న హైదరాబాద్లోని పీపుల్స్ప్లాజా నుంచి పీవీమార్గ్ వరకు అవేర్నెస్ వాక్ నిర్వహిస్తామని వెల్లడించారు. ఆయా కార్యక్రమాలకు షెడ్యూల్డ్ కులాల, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్తోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని తెలిపారు.